పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి ఎదురుదెబ్బ
Pakistan mediation : పశ్చిమాసియాలో శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం చేయాలని పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్లామాబాద్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు ఇరాన్ 'నో' చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కార్గో షిప్ సీజ్తో వివాదం
హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్కు చెందిన ఒక కార్గో షిప్ను అమెరికా నేవీ స్వాధీనం చేసుకోవడం వివాదానికి దారితీసింది. దీనిని ఇరాన్ "సముద్రపు దొంగతనం"గా అభివర్ణించింది. తమ దేశ ఆస్తులను విడుదల చేయకపోతే, ఆంక్షలను ఎత్తివేయకపోతే చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
Read also: Strait of Hormuz: యూరోపియన్ యూనియన్ తీరుపై ఇరాన్ ఆగ్రహం
Pakistan mediationఅమెరికా - ఇరాన్ డిమాండ్లు
అమెరికా ఇరాన్ యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని, హార్మూజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా తెరిచి ఉంచాలని కోరుతోంది. మరోవైపు విదేశాల్లో స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని, ఆర్థిక ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ కఠిన నిబంధనల కారణంగా చర్చలు ముందుకు సాగడం కష్టమవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

