Palghar Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాల్ఘర్ జిల్లా పరిధిలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఒక భయంకరమైన ప్రమాదంలో పెళ్ళి బృందంతో వెళుతున్న ట్రక్కును ఒక కంటైనర్ బలంగా ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కంటైనర్ ఢీకొనడంతో చెల్లాచెదురైన పెళ్లి బృందం
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఒకే ట్రక్కులో వంద మందికి పైగా పెళ్లి బంధువులు, కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పశువుల లోడ్తో వెళుతున్న ఒక వేగవంతమైన కంటైనర్, పెళ్లి బృందం ఉన్న ట్రక్కును అతి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో సామర్థ్యానికి మించి జనం ఉండటంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. వాహనాలు డ్యామేజ్ అవ్వడంతో పాటు ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.
Palghar Road Accident: మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్
ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పాల్ఘర్ పోలీసులు మరియు స్థానిక విపత్తు సహాయక బృందాలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారి సంఖ్య పదుల సంఖ్యలో చాలా ఎక్కువగా ఉండటంతో, నైబరింగ్ ఏరియాల నుండి కూడా పెద్ద ఎత్తున అంబులెన్సులను హైవేపైకి మోహరించారు.
Generic view of police inspecting a damaged heavy vehicle involved in a highway collision in Maharashtra.క్షతగాత్రులందరినీ త్వరితగతిన సమీపంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీనివల్ల ఈ ఘోర ఉదంతంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై, డ్రైవర్ల నిర్లక్ష్యంపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం.. ఏనుగుల ఘర్షణ లో మహిళ మృతి

