పార్లమెంట్(Parliament Updates) బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించారు.
సమావేశం ద్వారా రాజకీయ పార్టీల మధ్య సమన్వయం పెంచే ప్రయత్నం జరిగింది.

ప్రాంతీయ పార్టీల ప్రతినిధుల హాజరు
ఈ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ తరఫున సురేశ్ రెడ్డి, జనసేన పార్టీ నుంచి బాలశౌరి కూడా సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
బిల్లులు, అజెండాపై కేంద్రం వివరణ
బడ్జెట్ సమావేశాల్లో(Parliament Updates) ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, ఆర్థిక అజెండా అంశాలపై అఖిలపక్ష నేతలకు కేంద్రం ముందస్తుగా సమాచారం అందించనుంది. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారం అవసరమని కేంద్రం కోరినట్లు తెలిసింది. బడ్జెట్ సమావేశాల్లో చర్చలు ఫలప్రదంగా జరగాలన్న లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించారని అధికారులు తెలిపారు. సభలో అనవసరమైన అంతరాయాలు లేకుండా ప్రజా ప్రయోజన అంశాలపై చర్చ జరగాలని కేంద్రం ఆకాంక్షించినట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

