Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ వార్నింగ్.. కఠిన చర్యల హెచ్చరిక

పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ వార్నింగ్.. కఠిన చర్యల హెచ్చరిక

వార్త 2 days ago

Cattle smuggling : పశువుల అక్రమ రవాణాపై మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మండల పరిధిలోని కోలపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.

వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు.

చెక్‌పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీ

శుక్రవారం నిర్వహించిన ఈ తనిఖీలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధృవపత్రాలను తప్పనిసరిగా చెక్ చేయాలని సూచించారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్లలో నమోదు చేసి పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.

అక్రమ రవాణాపై కఠిన హెచ్చరిక

పశువుల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ట్రాఫిక్ బ్యాటన్స్, రిఫ్లెక్టివ్ జాకెట్లు వినియోగించాలని సూచించారు.

Read Also : రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఘాటు బహిరంగ లేఖ.. రైతు సమస్యలపై ఆగ్రహం

 Cattle smuggling

ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి

అక్రమ రవాణా లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ తనిఖీలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నిన్న ఒక్క రోజే తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బతో 22 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha