Pawan Fan Niranjan: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు వీరాభిమాని అయిన పొనుగంటి నిరంజన్ (17) అనారోగ్యంతో కన్నుమూశాడు. హన్మకొండకు చెందిన నిరంజన్, అరుదైన జన్యుపరమైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ, జీవితంపై కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న నిరంజన్ మరణవార్త అందరినీ కలచివేసింది.
Read Also : Durga Reddy: జంగారెడ్డిగూడెంలో TDP కార్యకర్త దారుణ హత్య..
Death of a die-hard Pawan Kalyan fan… Sonu Sood offers words of comfort to the family!
Pawan Fan Niranjan: వీడియో కాల్ చేసి కుటుంబానికి భరోసా ఇచ్చిన సోనూసూద్
నిరంజన్ మరణం గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం తనను ఎంతగానో బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం ఈ విషయం తెలిసి స్పందించారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి పరామర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో వారికి అన్ని విధాలా అండగా ఉంటానని, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.

