Penchalakona Brahmotsavam 2026: నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సాదర ఆహ్వానం అందింది.
సోమవారం మంగళగిరిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసి ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా కోరారు.
Read Also: AP Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపించకూడదు: సీఎం
పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం..
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ పాలకమండలి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రికి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 27 నుంచి మే 3వ తేదీ వరకు పెంచలకోనలో శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పవిత్ర వేడుకలకు ముఖ్యమంత్రి తప్పనిసరిగా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని వారు విన్నవించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రబాబుకు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని బహూకరించారు.

Penchalakona Brahmotsavam 2026: ఏర్పాట్లపై సీఎం ఆరా..
ఆహ్వానాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే మరియు ఆలయ ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించి, క్షేత్ర ప్రాశస్త్యాన్ని చాటిచెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ఆలయ అధికారులు పాల్గొని బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

