Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై ఎంత భారం పడుతుందో తెలుసా ?

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై ఎంత భారం పడుతుందో తెలుసా ?

వార్త 4 days ago

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య వాహనదారులు, రవాణా రంగంపై కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా లీటర్ ఇంధనంపై మరో 90 పైసలు అదనంగా భారం పడటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4,500 పెట్రోల్ బంకుల ద్వారా రోజుకు సగటున 10,000 కిలో లీటర్ల పెట్రోల్, అలాగే 15,000 కిలో లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతుంటాయి. ఈ తాజా పెంపుదల లెక్కల ప్రకారం.. కేవలం పెట్రోల్ వాడే వాహనదారులపై రోజుకు రూ.90 లక్షలు, డీజిల్ వినియోగించే లారీ, బస్సు, భారీ వాహనాల యజమానులపై రోజుకు ఏకంగా రూ.1.35 కోట్ల చొప్పున అదనపు ఆర్థిక భారం పడుతోంది. వెరసి రాష్ట్ర ప్రజలపై రోజువారీగా మొత్తం రూ.2.25 కోట్ల మేర భారం పడుతుండటంతో మధ్యతరగతి జేబులకు చిల్లులు పడుతున్నాయి.

Read Also : మత్స్యకారులకు రూ.20,000 భృతి!

 Fuel pump nozzle pouring petrol car.

విజయవాడలో సరికొత్త రికార్డులకు ధరలు.. రవాణా రంగం విలవిల

ప్రస్తుతం విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.45 కు చేరగా, డీజిల్ ధర రూ.101.17 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు మరియు దేశీయంగా పెరిగిన పన్నుల కారణంగా ఈ భారం మోయాల్సి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిత్యావసర వస్తువులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేరవేసే డీజిల్ ధరలు రూ.100 దాటడంతో రవాణా ఛార్జీలు భారీగా పెరిగి, పరోక్షంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవైపు జీతాలు పెరగక, మరోవైపు రోజురోజుకూ ఇంధన ధరలు దిగిరాకపోవడంతో సామాన్యుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పన్నుల రాయితీ ద్వారా ధరలను అదుపు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మత్స్యకారులకు రూ.20,000 భృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha