Phone Tapping Case: KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

Phone Tapping Case: KCRకు సిట్‌ నోటీసులు.. స్పందించిన కవిత

వార్త

వార్త

68d

Loading...

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు (Phone Tapping Case) లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని కవిత మండిపడ్డారు.

KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

ఫోన్ ట్యాపింగ్ జరగడం నిజంగా బాధాకరం

కేసును సీరియస్ గా తీసుకుని త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని.. అయితే, కేసును ముగించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) జరగడం నిజంగానే చాలా బాధాకరమని.. కానీ, దానికి తగినటువంటి పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచిచూడాలని అన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ఉంటుందని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. రేపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Medigadda Barrage : ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజీ - కేంద్రం రెడ్ అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha