తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్కు రంగం సిద్ధమవుతోంది. నేచురల్ స్టార్ నాని, 'సాహో' ఫేమ్ దర్శకుడు సుజీత్ కలిసి కొత్త సినిమా చేయనున్నారన్న వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.
ఇప్పటికే తన సహజ నటనతో పాటు ప్రయోగాత్మక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని (Nani), ఈసారి పూర్తిగా భిన్నమైన స్టైలిష్ యాక్షన్ అవతారంలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుంచి ప్రారంభం కానుంది. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించబోతోందని తెలుస్తోంది. వీరిద్దరు ఫస్ట్ టైం జోడీ కడుతున్నారని, ఫ్రెష్ కాంబినేషన్ అని అభిమానులు అంటున్నారు. మేకర్స్ 2027లో ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Tollywood: రష్మిక-విజయ్ పెళ్లిపై పుకార్లకు చెక్.. ఫిబ్రవరి 26న ముహూర్తం?

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com

