Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాని భోగాపురం పర్యటనకు సర్వం సిద్ధం.. థింసా నృత్యంతో ఘన స్వాగతం

ప్రధాని భోగాపురం పర్యటనకు సర్వం సిద్ధం.. థింసా నృత్యంతో ఘన స్వాగతం

వార్త 6 days ago

Bhogapuram Airport: దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు.

ఈ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

ప్రధానికి ఘన స్వాగతం – ప్రముఖుల హాజరు

ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఘన స్వాగతం పలకనున్నారు. సరిగ్గా 10.58 గంటలకు ప్రధాని చేతుల మీదుగా కొత్త టెర్మినల్ ప్రారంభం కానుంది.

Bhogapuram Airport: గిరిజన సంప్రదాయ ‘థింసా’ నృత్య ప్రదర్శన

ఈ పర్యటనలో భాగంగా గిరిజన మహిళలు మరియు బాలికలు ప్రత్యేకంగా ప్రదర్శించే ‘థింసా’ నృత్యం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఏకరీతి సంప్రదాయ వస్త్రధారణతో వారు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. అలాగే, టెర్మినల్ లోపల ప్రదర్శించనున్న తెలుగు కళాకృతులు, మన సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే చిత్రాలను ప్రధాని తిలకిస్తారు.

బహిరంగ సభ మరియు ఉన్నత స్థాయి సమీక్ష

టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి పకడ్బందీ చర్యలు చేపట్టారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha