‘The Order of the White Double Cross‘ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్లొవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (1st క్లాస్)’ (The Order of the White Double Cross) ను ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని చేతుల మీదుగా ప్రధాని మోదీ స్వీకరించారు.
స్లొవేకియా దేశంతో భారత్కు ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో, అలాగే ఆ దేశ విదేశీ విధాన ప్రయోజనాలకు విశేష సహకారాన్ని అందించడంలో మోదీ చూపిన చొరవకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును బహూకరించారు. ఈ పురస్కారం కేవలం ఒక వ్యక్తికి దక్కిన గౌరవం మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాల మధ్య భారతదేశానికి పెరుగుతున్న దౌత్యపరమైన ప్రాధాన్యతను మరియు వ్యూహాత్మక బంధాన్ని స్పష్టం చేస్తోంది.
Read Also : రష్యా చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్న బ్రిటన్.. భారతీయుడు అరెస్ట్!

గ్లోబల్ లీడర్గా మోదీ: 33వ అంతర్జాతీయ పురస్కారం
ప్రధాని మోదీ నాయకత్వ శైలికి, ప్రపంచ శాంతి భద్రతలలో భారత్ వహిస్తున్న క్రియాశీలక పాత్రకు ఈ పురస్కారం మరో నిదర్శనంగా నిలిచింది. తాజాగా అందుకున్న స్లొవేకియా అవార్డుతో కలిపి మోదీ ఖాతాలో ఇప్పటివరకు చేరిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 33కు చేరడం విశేషం. వివిధ అరబ్ దేశాలు, ఐరోపా దేశాలు, అమెరికా మరియు పసిఫిక్ దీవుల దేశాల నుండి ఆయన ఇప్పటికే అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ఈ మైలురాయి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక గ్లోబల్ లీడర్గా మోదీకి ఉన్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తోంది. ఈ అవార్డుల పరంపర ద్వారా ఐరోపా సమాఖ్యతో (EU) మరియు తూర్పు ఐరోపా దేశాలతో భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక మరియు రక్షణ రంగా బంధాలు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

