Krishnateja : అధికారులంటే కేవలం అక్రమాలు, అవినీతికి పాల్పడేవారే కాదు.. ప్రజల సొమ్మును కాపాడే నిజాయతీపరులు కూడా ఉంటారని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఐఏఎస్ మరోసారి నిరూపించారు.
కాకినాడ జిల్లాలో తాజాగా వెలుగుచూసిన ఒక భారీ అవినీతి వ్యవహారంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో ఏకంగా ₹1.91 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం మరియు అక్రమాలు జరిగినట్లు తనిఖీల్లో తేలింది. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్, బాధ్యులైన అధికారులకు నడిరోడ్డుపై గట్టి వార్నింగ్ ఇచ్చారు. అవినీతికి పాల్పడే వారి పట్ల శాఖాపరంగా ఎంత కఠినంగా ఉంటామో ఈ చర్యల ద్వారా స్పష్టం చేశారు.

పన్నుల సొమ్ముపై నమ్మకం ద్రోహం.. ఉపేక్షించేది లేదు!
ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి కృష్ణతేజ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలు ఎంతో నమ్మకంతో, కష్టపడి సంపాదించిన డబ్బును ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. “ప్రజాధనాన్ని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి” అంటూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా హెచ్చరించారు. ప్రజల సొమ్మును స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. కృష్ణతేజ తీసుకున్న ఈ నిర్ణయం మరియు ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
నెల్లూరులో వైభవంగా ప్రారంభమైన 'రొట్టెల పండుగ'.. రొట్టె స్వీకరించిన మంత్రి నారాయణ!

