Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడి మోజులో కన్నపిల్లలను వేడి నూనెతో కాల్చిన కసాయి తల్లి

ప్రియుడి మోజులో కన్నపిల్లలను వేడి నూనెతో కాల్చిన కసాయి తల్లి

వార్త 1 week ago

Shadnagar crime:ప్రేమ పిచ్చితో ఒక తల్లి కనికరం లేకుండా ప్రవర్తించిన ఘటన షాద్‌నగర్ పరిధిలోని నందిగంలో వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడిన కన్నతల్లి, తన ఇద్దరు చిన్నారులను వేడి నూనెతో కాల్చి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసింది.

ఈ అమానుషమైన చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఆ చిన్నపిల్లలు తల్లి చేతిలోనే నరకాన్ని అనుభవించడం సమాజంలో చర్చనీయాంశమైంది.

Read also: Delhi : చిన్నారిపై హత్యాచారం.. కాలుపై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు

 The cruel mother who burned with hot oil

అమానుషంగా ప్రవర్తించిన తల్లి

బిహార్కు చెందిన పింకీదేవి తన ప్రియుడు చిందు కుమార్‌తో కలిసి నందిగంలో నివసిస్తోంది. వీరు ఆరు మరియు నాలుగు సంవత్సరాల వయస్సు గల తమ సొంత పిల్లలను అత్యంత దారుణంగా హింసించారు. కేవలం అక్రమ సంబంధం కోసం, పిల్లలను అడ్డుగా భావించి వేడి నూనెను వారిపై పోసి దారుణంగా కాల్చేశారు. శరీరంపై గాయాలతో ఆ చిన్నారులు పడుతున్న వేదన చూసి స్థానికులు చలించిపోయారు.

Shadnagar crime:స్థానికుల సమయస్ఫూర్తితో బయటపడ్డ చిన్నారులు

పిల్లల ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చిన్నారులు గాయాలతో ఉండటం చూసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులిద్దరికీ దేహశుద్ధి చేసి, వెంటనే పోలీసులకు అప్పగించారు. బాధితులను రక్షించి చికిత్స కోసం తరలించారు. ఈ కసాయి తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha