Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాముడి సొమ్ము నొక్కేసింది అప్పుడే !!

రాముడి సొమ్ము నొక్కేసింది అప్పుడే !!

వార్త 3 weeks ago

Ayodhya Ram Mandir Donation Issue : ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య రాముడి విరాళాల సొమ్ము స్వాహా ఉదంతంలో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు తరలివచ్చిన కోట్లాది మంది భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకుని పెద్ద ఎత్తున సమర్పించిన నగదు కానుకలను నిందితులు అత్యంత చాకచక్యంగా కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న సమయాన్ని అదనుగా చేసుకుని, అక్కడ పర్యవేక్షణ లోపాలను వాడుకుంటూ ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వామివారి సొమ్మును నొక్కేసిన ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

 Ayodhya Ram Mandir

బావ, బావమరుదుల స్కెచ్

ఈ అంతర్గత దోపిడీ నెట్‌వర్క్‌లో బావ, బావమరుదులైన అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రాలు కీలక సూత్రధారులుగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ కలిసి ఆలయ విరాళాల నిర్వహణ గొలుసుకట్టులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని పెద్ద మొత్తంలో సొమ్మును దారి మళ్లించారు. నిందితుడైన అవినాశ్ శుక్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని నుంచి రికార్డు స్థాయిలో ఏకంగా ₹89 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో ఆలయ సిబ్బంది లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రికవరీలు, అరెస్టులు జరిగే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.

టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha