Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వే అభివృద్ధి పనులపై దృష్టి.. దక్షిణ కోస్తా రైల్వే జీఎంతో కేశినేని చిన్ని భేటీ

రైల్వే అభివృద్ధి పనులపై దృష్టి.. దక్షిణ కోస్తా రైల్వే జీఎంతో కేశినేని చిన్ని భేటీ

వార్త 2 weeks ago

Kesineni Chinni: విజయవాడ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ప్రజల దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ మాథుర్‌ను ఆయన ప్రత్యేకంగా కలిశారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పలు కీలక రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై జీఎంతో ఎంపీ విస్తృతంగా చర్చించారు.

భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేశినేని చిన్ని, విజయవాడలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు మరియు మరిన్ని కొత్త రైల్వే లైన్లను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రతిపాదనలను జీఎంకు అందజేసినట్లు వెల్లడించారు. చారిత్రక మరియు పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన కొండపల్లి రైల్వే స్టేషన్‌ను ‘అమృత్ భారత్’ పథకంలో చేర్చి ఆధునీకరించాలని ఈ సందర్భంగా ఆయన గట్టిగా కోరారు.

నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆర్వోబీలు, వంతెనల నిర్మాణం

విజయవాడ నగరంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా పలు ప్రాంతాల్లో సరికొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ROB) నిర్మాణం చేపట్టాలని ఎంపీ ప్రతిపాదించారు. నగరంలో మొత్తం 8 కొత్త ఆర్వోబీలను నిర్మించాల్సిన అవసరం ఉందని జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల ప్రజలకు ఎంతో కీలకమైన ఎర్రకట్ట వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. అలాగే గుణదల వద్ద ఉన్న LC-8 లెవల్ క్రాసింగ్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందిని వివరించి, ఆ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Kesineni Chinni: అమృత్ భారత్ నిధులు మరియు బెంగళూరు కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన

విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కోసం గతంలో అధికారులు టెండర్లు పిలిచినప్పటికీ, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఈ సమస్యను త్వరలోనే రాష్ట్రంలోని ఏపీ ఎంపీలందరం కలిసి కేంద్ర రైల్వేమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద నిధులు మరింత వేగంగా మంజూరయ్యేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి గుత్తి మీదుగా బెంగళూరుకు నేరుగా సరికొత్త రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖను కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే రంగంలో విజయవాడను మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.

ఎగువ నుంచి వస్తోన్న వరదతో నిండు కుండల్లా ప్రాజెక్టులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha