Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యా నుంచి ఇండియాకు పెరుగుతున్న పెట్రోల్ ఆర్డర్లు !

రష్యా నుంచి ఇండియాకు పెరుగుతున్న పెట్రోల్ ఆర్డర్లు !

వార్త 3 weeks ago

Petrol : అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ధాటికి రష్యాకు చెందిన దాదాపు 40 శాతం చమురు శుద్ధి కర్మాగారాలు (ఆయిల్ రిఫైనరీలు) తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న రష్యా, ప్రస్తుతం తీవ్రమైన దేశీయ ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రష్యన్ రిఫైనరీలు మరియు ఇంధన సంస్థలు అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ ఆయిల్ కంపెనీలను ఆశ్రయించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’ (Reuters) వెల్లడించింది. యుద్ధం కారణంగా రష్యాలోనే పెట్రోల్ కొరత ఏర్పడటం, విదేశాల నుంచి ముఖ్యంగా భారత్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడం గ్లోబల్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

డిస్కౌంట్ క్రూడాయిల్ టు రెడీమేడ్ పెట్రోల్

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా దగ్గరి నుంచే భారీ డిస్కౌంట్ ధరలకు ముడి చమురును (క్రూడాయిల్) కొనుగోలు చేస్తోంది. అలా కొన్న చమురును మన రిఫైనరీలలో శుద్ధి చేసి, పెట్రోల్‌గా మార్చి, ఇప్పుడు అదే రష్యాకు తిరిగి విక్రయించాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది. భారతీయ కంపెనీలు నేరుగా కాకుండా అంతర్జాతీయ ట్రేడర్ల ద్వారా ఈ పెట్రోల్‌ను రష్యాకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రష్యాలో రిఫైనరీల ధ్వంసం మరియు అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు వరుసగా నాల్గవ రోజు కూడా పెరిగాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంధన ధరలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

అమెరికా-ఇరాన్ యుద్ధం .. 13 మంది భారతీయులు మృతి..దాడులను నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha