Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేవంత్‌కు మోదీ ఆఫర్ ఇచ్చారా?.. ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌కు మోదీ ఆఫర్ ఇచ్చారా?.. ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

వార్త 16 hrs ago

రేవంత్‌కు మోదీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు: ధర్మపురి అర్వింద్

Telangana politics : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ తిరస్కరించలేరని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా అలాంటి అవకాశం ఇచ్చి ఉండొచ్చని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి, మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేలకు ఇచ్చిన తరహాలోనే రేవంత్‌కు కూడా రాజకీయ ఆఫర్ ఇచ్చి ఉండవచ్చని ఆయన అన్నారు.

భవిష్యత్తులో పశ్చాత్తాపం రావొచ్చని వ్యాఖ్య

ఆ ఆఫర్‌ను రేవంత్ రెడ్డి తిరస్కరించి ఉంటే భవిష్యత్తులో పశ్చాత్తాపపడే పరిస్థితి రావొచ్చని అర్వింద్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

భగీరథ్ పోక్సో కేసుపై స్పందన

బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని ధర్మపురి అర్వింద్ ఖండించారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కేసు నమోదైన తర్వాత బండి సంజయ్‌తో తాను మాట్లాడలేదని కూడా తెలిపారు.

Read also : Gates College Free EV Training: నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!

 Telangana politics

తెలంగాణ బీజేపీలో నాయకత్వ సమస్యలే కారణమా?

దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతున్నా తెలంగాణలో మాత్రం పార్టీ అధికారానికి చేరువ కాలేకపోవడానికి స్థానిక నాయకత్వ సమస్యలే ప్రధాన కారణమని అర్వింద్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా రాష్ట్రంలో బలమైన గ్రూప్ నాయకత్వం లేకపోవడం తమ పార్టీ బలహీనతగా మారిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను కోరుకోలేదని అంగీకరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha