Dailyhunt
రూ.15 వేల లోపే రెడ్‌మీ కొత్త 5G ఫోన్

రూ.15 వేల లోపే రెడ్‌మీ కొత్త 5G ఫోన్

వార్త 1 week ago

Redmi A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి సరికొత్త 5G ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 'రెడ్‌మీ A7 Pro 5G' పేరుతో విడుదలైన ఈ ఫోన్ బడ్జెట్ ధరలో అత్యుత్తమ ఫీచర్లను అందిస్తోంది.

ముఖ్యంగా రూ.15,000 లోపు ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

Read Also :CBI FIR: లాలూ ప్రసాద్ యాదవ్‌ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

 Redmi A7 Pro 5G: Redmi’s new 5G phone under Rs. 15 thousand

భారీ డిస్‌ప్లే.. శక్తివంతమైన బ్యాటరీ

ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల భారీ HD+ LCD డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఫోన్ పనితీరు కోసం 6nm ఆక్టా-కోర్ యూనిసోక్ T8300 ప్రాసెసర్‌ను వాడారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3 (HyperOS 3) పై పనిచేయడం విశేషం. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఏకంగా 6,300mAh భారీ బ్యాటరీని 15W ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు.

Redmi A7 Pro 5G: కెమెరా.. స్టోరేజ్ వివరాలు

ఫోన్ వెనుక భాగంలో 32MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4GB RAMతో పాటు 64GB లేదా 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, 5G కనెక్టివిటీ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశారు.

ధర.. లభ్యత

రెడ్‌మీ A7 Pro 5G ప్రారంభ ధర రూ.11,499 గా నిర్ణయించారు. ఈ ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 15 నుంచి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రారంభం కానున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఒకే రోజులో హైదరాబాద్ లో 108 ఇ-విటారా కార్ల డెలివరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha