Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్!

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కానిస్టేబుల్ అరెస్ట్!

వార్త 5 days ago

Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనంగా మారిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను మరింత ముమ్మరం చేసింది.

ఈ కేసులో ఇప్పటికే సీఐ నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అరెస్ట్ చేశారు. పోలీసుల థర్డ్ డిగ్రీ వల్లే సాయికృష్ణ ప్రాణాలు కోల్పోయాడనే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

సాయికృష్ణ లాకప్ డెత్ అంశంపై కానిస్టేబుల్ బాబురావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచి, కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు లోతైన విచారణ కోసం కస్టడీకి కోరనున్నారు. పోలీస్ స్టేషన్ లాకప్‌లో సాయికృష్ణపై జరిగిన థర్డ్ డిగ్రీ టార్చర్‌లో బాబురావు కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గట్టి ఆధారాలు సేకరించారు. సాయికృష్ణను విచక్షణారహితంగా కొట్టడం వల్లే అతడు మరణించాడని సిట్ నిర్ధారణకు వచ్చింది.

Read Also : AP Politics: కేంద్ర కేబినెట్‌లో ఏపీకి మరో మంత్రి పదవి?

 Another constable arrested in the Saikrishna lock-up death case!

Sai Krishna Lockup Death Case: నేడు 'హెబియస్ కార్పస్' పిటిషన్‌పై విచారణ

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కేసు పిటిషన్‌పై నేడు అత్యంత కీలకమైన విచారణ జరగనుంది. తన కొడుకు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గతంలోనే హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్పందించిన న్యాయస్థానం, సాయికృష్ణను తక్షణమే కోర్టు ముందు హాజరుపరచాలని గతంలోనే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా ఆదేశించింది.

సాయికృష్ణ అదృశ్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేకంగా 'సిట్'ను ఏర్పాటు చేసింది. సిట్ జరిపిన నిష్పాక్షిక దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. విచారణ పేరిట పోలీసులే సాయికృష్ణను స్టేషన్‌లో కొట్టి చంపేసి, ఆపై మృతదేహాన్ని మాయం చేశారనే దారుణమైన విషయం వెలుగుచూసింది. దీంతో అప్పటివరకు కేవలం ఒక సాధారణ 'మిస్సింగ్ కేసు'గా నడుస్తున్న ఈ వ్యవహారం, కాస్తా సంచలన 'లాకప్ డెత్' కేసుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఈ కేసులో మరికొందరు సిబ్బంది పాత్రపై సిట్ ఆరా తీస్తోంది.

జూలై 10న ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha