Delhi building collaps: దేశ రాజధాని ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఘటన తీవ్ర కలకలం రేపింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ వాణిజ్య భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Read also: PM modi: మన్ కీ బాత్ 134వ ఎపిసోడ్ లో భారత క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు
Delhi building collapse incident
వేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు దాదాపు తొమ్మిది మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారందరిని చికిత్స కోసం ఎయిమ్స్ ట్రామా సెంటర్ తరలించారు. సహాయక బృందాలు అత్యాధునిక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Delhi building collaps: ఘటన వెనుక కారణాలు
ఈ భవనం కుప్పకూలిన సమయంలో పక్కనే ఉన్న టీన్ షెడ్ క్యాంటీన్లో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు శిథిలాలు క్యాంటీన్పై పడటంతో ఈ భారీ నష్టం జరిగింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్లు, కార్యాలయాలు ఉండేవి. భవనంపై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, ప్రాణనష్టం తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ మోదీ అంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

