Telangana government:తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. రైతులకు క్వింటాకు 500 రూపాయల చొప్పున ఇచ్చే ఈ సన్న వడ్ల బోనస్ కొత్త నిబంధనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి.
ఇకపై కేవలం ప్రభుత్వం నిర్దేశించిన 7 రకాల వరి విత్తనాలు వేసి పండించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ సొమ్ము అందుతుంది. ఈ మార్పుల ద్వారా అక్రమాలను అరికట్టి నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కాబట్టి రైతులు ఇకపై విత్తనాలు కొనేటప్పుడు ఈ విషయాలను తప్పక గమనించాలి.
Read also: Kommidi Narsimha Reddy: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూత
New guidelines for fine-grain paddy bonus
ఏడు రకాల వరి విత్తనాలకే బోనస్
ప్రభుత్వం గుర్తించిన రకాలు వేస్తేనే బోనస్ జమ అవుతుంది. ర్ఎన్ఆర్-15048, బీపీటీ-5204, కేఎన్ఎం-1638, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, డబ్ల్యుజీఎల్-44, కేఎన్ఎం-7715 రకాలు మాత్రమే దీనికి అర్హమైనవి. రైతులు ఈ విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు డీలర్ వద్ద వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలి. రైతు పేరు, తండ్రి పేరు, విత్తన లాట్ నంబర్ వంటి వివరాలు డిజిటల్ రికార్డుల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో బోనస్ మొత్తాన్ని జమ చేస్తుంది.
Telangana government:విత్తన కొనుగోలుపై ప్రత్యేక నిఘా
విత్తన డీలర్లు ప్రతి అమ్మకాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ డిజిటల్ ప్రక్రియ వల్ల విత్తన నాణ్యతతో పాటు బోనస్ పారదర్శకంగా అందుతుంది. వానాకాలం సీజన్ నుంచి ఈ కొత్త పద్ధతి అమలవుతోంది. రైతులు తమ వివరాలు నమోదు అయ్యాయో లేదో డీలర్లను అడిగి తెలుసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే సన్న వడ్ల బోనస్ అందుకోవడం సాధ్యపడుతుంది. రైతులు ఈ కొత్త మార్పులను అర్థం చేసుకుని సకాలంలో వివరాలు నమోదు చేయించుకోవడం మంచిది.
Epaper: epaper.vaartha.com

