Dailyhunt
Savitribai Phule Jayanti: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

Savitribai Phule Jayanti: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

వార్త 3 months ago

మ్మడి గుంటూరు(Guntur) జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి(Savitribai Phule Jayanti) మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీమతి వంకదారి సుబ్బరత్నమ్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమం సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Read also: Amazon: హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే మహిళల విద్యాభివృద్ధికి చేసిన సేవలు అనిర్వచనీయమని ప్రశంసించారు. సమాజంలో మహిళలకు విద్య అనవసరమనే అపోహలు ఉన్న కాలంలో, అనేక అవమానాలు, ప్రతిఘటనలను ఎదుర్కొని విద్యను ఆయుధంగా మార్చిన ధైర్యశాలినిగా ఆమెను కొనియాడారు.

దళితులు-పేదవర్గాలకు విద్య అందించడం

మహిళల అభ్యుదయానికి చదువు ఎంత కీలకమో ఆమె జీవితమే సజీవ ఉదాహరణని తెలిపారు. బాలికల పాఠశాలల స్థాపన, దళితులు-పేదవర్గాలకు విద్య అందించడంలో ఆమె పోరాటం ఈతరం తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్య ద్వారా సమాజాన్ని మార్చగల శక్తి మహిళలకే ఉందని ఆమె నిరూపించిందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని సావిత్రిబాయి పూలే సేవలను స్మరించుకున్నారు. మహిళా విద్యాభివృద్ధి దిశగా మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

RailOne app: జనరల్ టికెట్లపై శుభవార్త.. ఆన్‌లైన్ బుకింగ్‌కు 3% డిస్కౌంట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha