జింబాబ్వే క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ సికిందర్ రజా (Sikander Raza) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న తమ్ముడు మహమ్మద్ మెహదీ (13) అనారోగ్యంతో కన్నుమూశాడు.
ముహమ్మద్ మెహదీ, మృతి చెందినట్లు జింబాబ్వే క్రికెట్ అధికారికంగా ప్రకటించింది. జింబాబ్వే క్రికెట్ విడుదల చేసిన ప్రకటనలో 'జింబాబ్వే టీ20 కెప్టెన్ సికందర్ రజా కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపం.
Sara Tendulkar: సారా టెండూల్కర్ పై నెట్టింట ట్రోలింగ్?
ఆరోగ్య సమస్యల కారణంగా మృతి
ఆయన చిన్న సోదరుడు ముహమ్మద్ మెహదీ డిసెంబర్ 29, 2025న హరారేలో 13 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పుట్టినప్పటి నుంచి హీమోఫీలియా వ్యాధితో బాధపడుతున్న మెహదీ ఇటీవల ఎదురైన ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. డిసెంబర్ 30న వారెన్ హిల్స్ సమాధి స్థలంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొంది. 'సికిందర్ రజా కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
ఈ క్లిష్ట సమయంలో బోర్డు సభ్యులు, మేనేజ్మెంట్, ఆటగాళ్లు, సిబ్బంది అందరూ రజా కుటుంబానికి అండగా ఉంటాం. మెహదీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం' అని జింబాబ్వే క్రికెట్ పేర్కొంది. ఈ వార్తపై సికిందర్ రజా (Sikander Raza) సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. జింబాబ్వే క్రికెట్ బోర్డు ట్వీట్కు రిప్లై ఇస్తూ, ఒక 'బ్రోకెన్ హార్ట్' ఎమోజీని షేర్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

