Gold Rate Today: గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయంగా బులియన్ మార్కెట్పై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
ముఖ్యంగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త వాతావరణం, డాలర్ మారకం విలువలో వస్తున్న హెచ్చుతగ్గుల కారణంగా ఇన్వెస్టర్లు పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో అంతర్జాతీయంగా దీనికి డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి.
BullionMarket
Read also: Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు (హైదరాబాద్, విజయవాడ)
ప్రముఖ బిజినెస్ వెబ్సైట్ ‘గుడ్ రిటర్న్స్’ గణాంకాల ప్రకారం.. శనివారం ఉదయం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో పసిడి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి:
24 క్యారెట్ల బంగారం (మేలిమి బంగారం) 10 గ్రాముల (తులం) ధర రూ.1,57,650 వద్ద కొనసాగుతోంది, 22 క్యారెట్ల బంగారం (ఆభరణాల బంగారం): 10 గ్రాముల ధర రూ.1,44,510 గా నమోదైంది.
Gold Rate Today: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేట్లు
దేశ రాజధాని మార్కెట్లోనూ పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,57,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,660 గా రికార్డయింది.
కిలో వెండిపై రూ.100 పెరుగుదల
బంగారంతో పాటే వెండి ధరలు కూడా స్వల్పంగా పుంజుకున్నాయి. దేశవ్యాప్తంగా కిలో వెండిపై సుమారు రూ.100 మేర పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నైరూ.2,90,100గా ఉంది. ఢిల్లీ, బెంగళూరు రూ.2,80,100గా ఉంది. మార్కెట్లో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఇలాగే ముదిరితే రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

