Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సినీ నటి త్రిషపై (Trisha) తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన త్రిషకు క్షమాపణ చెప్పారు.
పొరపాటుగా ఆ వ్యాఖ్యలు చేశానని, తనను క్షమించాలని కోరారు. తనపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నటి త్రిష తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను అనుకోలేదని, సంబంధం లేని విషయాల్లోకి తనను లాగవద్దని త్రిష మండిపడ్డారు.

ఎవరినీ బాధపెట్టే ఉద్దేశం తనకు లేదన్న నాగేంద్రన్
ఇవి పొరపాటున చేసిన వ్యాఖ్యలు. బీజేపీ అఖిల భారత మహిళా విభాగం నాయకురాలు వానతి శ్రీనివాసన్, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై నాతో ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడారు. నా వ్యాఖ్యల పట్ల బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను అని నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని, అలాగే ఎవరి మనసును బాధపెట్టకూడదనే అనుకుంటానని అన్నారు.
ఇటీవల నటుడు విజయ్, సేలంలో నిర్వహించిన రాజకీయ ర్యాలీని విమర్శిస్తూ, రాజకీయాల్లో ఆయనకు అనుభవం లేదని చెప్పే క్రమంలో నైనార్ నాగేంద్రన్.. 'విజయ్ ముందు నటి త్రిషతో రిలేషన్ నుంచి బయటకు రావాలి.. అప్పుడే రాజకీయ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమవుతుంది' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Read hindi news: hindi.vaartha.com
Tamil Nadu: బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం

