Tamil Nadu: తమిళనాడు ఐపీఎస్ వర్గాల్లో ఊహించని భారీ మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (DVAC) డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.
అరుణ్ను ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ఐజీ (ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) హోదాలో ఉన్న మహిళా అధికారిణి సి. మహేశ్వరిని డీవీఏసీ నూతన అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కె. మణివాసన్ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏడీజీపీ ర్యాంక్ అధికారి అయిన ఎ. అరుణ్ను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్గా బదిలీ చేశారు.

తీవ్ర రాజకీయ వివాదాలు.. ఈసీ యాక్షన్
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం, మే నెలాఖరులో సీఎం విజయ్ సర్కార్ అరుణ్ను డీవీఏసీ చీఫ్గా నియమించింది. అయితే, ఆయన నియామకం మొదటి నుంచీ వివాదాస్పదంగా మారింది. గతంలో ఆయన చెన్నై పోలీస్ కమిషనర్గా పనిచేసిన కాలంలో అప్పటి అధికార పక్షమైన 'డీఎంకే'కు అనుకూలంగా వ్యవహరించారని ప్రస్తుత అధికార పార్టీ టీవీకే (తమిళగ వెట్రి కజగం) తో పాటు పలు ఇతర రాజకీయ పక్షాలు ఆరోపించాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో పక్షపాత వైఖరి ప్రదర్శించారనే ఫిర్యాదులపై గతంలో ఎన్నికల సంఘం కూడా ఆయనపై చర్యలు తీసుకుంది. అలాంటి అధికారిని కీలకమైన అవినీతి నిరోధక శాఖ అధిపతిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Tamil Nadu: హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!
డీవీఏసీ డైరెక్టర్ నియామకంపై దాఖలైన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ వ్యవహారంపై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. “సమాజంలో అత్యున్నత బాధ్యతల్లో ఉండే వ్యక్తులు ఎలాంటి మచ్చ లేనివారై ఉండాలి. ముఖ్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని నడిపించే వ్యక్తిత్వం 'కళంకం లేని చంద్రుడిలా' స్వచ్ఛంగా, నిందలకు అతీతంగా ఉండాలి” అని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో సి.వి. నరసింహన్, సి.ఎల్. రామకృష్ణన్ వంటి నిష్కళంకమైన అధికారులు అలంకరించిన ఈ పదవిపై చిన్న ఆరోపణ వచ్చినా, అది మొత్తం వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం నుంచి ఎదురైన ఒత్తిళ్లు, రాజకీయ వివాదాలకు ముగింపు పలకడానికే ముఖ్యమంత్రి విజయ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Epaper: epaper.vaartha.com
వ్యవసాయంలో ఆవిష్కరణలు పెంపొందించడంపై శిక్షణ..పాల్గొన్న 24 దేశాల ప్రతినిధులు

