Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెక్ దిగ్గజాలకు ఇరాన్ షాక్: సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఆర్మీ

టెక్ దిగ్గజాలకు ఇరాన్ షాక్: సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఆర్మీ

వార్త 5 days ago

మెరికా, ఇరాన్ దేశాల మధ్య ముగింపు లేని యుద్ధ వాతావరణం, అలాగే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న దిగ్బంధం కారణంగా ప్రపంచం ఇప్పటికే తీవ్రమైన ముడిచమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ తన ఆర్థిక అవసరాల కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆ జలమార్గం గుండా సముద్రగర్భంలో విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ ఇప్పుడు తన దృష్టిని కేంద్రీకరించింది. గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఈ సముద్రగర్భ కేబుళ్లను ఉపయోగించుకుంటున్నందుకు గాను వాటి నుండి భారీగా రుసుములు (ఫీజులు) వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థ ‘సీఎన్ఎన్’ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫాఘరీ గత వారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ అంతర్జాతీయ కేబుళ్ల వినియోగానికి చెల్లింపులు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Operation Sindoor: 22 నిమిషాల్లోనే పాక్‌పై మెరుపు దాడి..ఆర్మీ చీఫ్

 Submarine Cables

Submarine Cables: ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయాలు

ఒకవేళ ఇరాన్ డిమాండ్లకు టెక్ కంపెనీలు సహకరించడానికి నిరాకరిస్తే.. ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయాలు ఏర్పడవచ్చని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు పరోక్షంగా హెచ్చరించాయి. దీనివల్ల గ్లోబల్ ఇంటర్నెట్ వేగం పడిపోవడమే కాకుండా, ఈ-కామర్స్ రంగానికి ఆటంకాలు ఎదురవుతాయని, అలాగే ప్రభావిత ప్రాంతాల్లో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు, డబ్బు బదిలీలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, ఇరాన్‌పై అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను అతిక్రమించకుండా, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అమెరికన్ కంపెనీలు ఇరాన్ ప్రభుత్వానికి ఎలా చెల్లింపులు చేయగలవనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. అంతర్జాతీయ చట్టాలు, ఆంక్షల నేపథ్యంలో ఈ చెల్లింపుల ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha