Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telugu States: పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం

Telugu States: పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం

వార్త 5 months ago

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో(Telugu States) చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకోవడం శీతాకాల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Read also: AP :దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు - ఏపీలో చలి పెరుగుదల

తెలంగాణలో మొత్తం 14 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర జిల్లాల్లో కూడా చలి తీవ్రత కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మన్యం, అల్లూరి జిల్లాల్లో తీవ్రమైన చలి

ఆంధ్రప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాల్లో చలి మరింత ఎక్కువగా ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. నిన్న రాత్రి పాడేరు ప్రాంతంలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా, పెదబయలు వద్ద 4.8 డిగ్రీలు, చింతపల్లి ప్రాంతంలో 5 డిగ్రీల వరకు చలి తీవ్రత నమోదైంది. చలి తీవ్రత పెరగడంతో ఉదయపు వేళల్లో పొగమంచు ఏర్పడుతోంది. రాత్రివేళల్లో చలిగాలులు వీచడంతో వృద్ధులు, చిన్నపిల్లలు, రైతులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రజలకు వాతావరణ శాఖ సూచనలు

వాతావరణ నిపుణుల సూచనల మేరకు

  • ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తగినంత వెచ్చని దుస్తులు ధరించాలి
  • వృద్ధులు, పిల్లలు చలిగాలులకు దూరంగా ఉండాలి
  • రైతులు పంటలను చలివాతావరణం నుంచి రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి

అని అధికారులు సూచిస్తున్నారు.

మరికొన్ని రోజులు చలి కొనసాగుతుందని అంచనా

వాతావరణ(Telugu States) పరిస్థితులను పరిశీలిస్తే రాబోయే కొన్ని రోజులు కూడా ఇలాంటి చలి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha