శివాలయాల్లో నందీశ్వరుడు ఎల్లప్పుడూ శివుని వైపే చూసి కూర్చుంటాడు. పండితుల ప్రకారం, ఇది భక్తి, ఏకాగ్రత, సంపూర్ణ శరణాగతి యొక్క ప్రతీక. (Temple) నంది ద్వారపాలకుడు ( Nandishwara ) కాబట్టి, భక్తుల మనసు చంచలం కాకుండా, దైవ చింతనలో స్థిరంగా ఉండేలా ప్రేరేపిస్తాడు.
శివుడు నిరంతరం తపస్సులో లీనమై ఉంటారని నమ్మకం ఉంది. భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబితే, నంది వాటిని శివుడికి చేరుస్తాడని నమ్ముతారు. ఇది ఒక రీతిగా భక్తుల అభ్యర్థనలు దేవుడికి చేరే మార్గం అవుతుంది.

పరమ ఆధ్యాత్మికంగా, నంది శివుడిని చూసి కూర్చోవడం ద్వారా భక్తి సాధకులు తమ మనసును విసర్గం చెయ్యకుండా, ఏకాగ్రతతో ధ్యానం, జపం, తపస్సు వంటి ఆచారాలు పాటించాలి అని సూచిస్తుంది. (Temple) కొంతమంది పండితులు చెబుతారు, నంది శివుడిని చూసి ఉన్నందున భక్తి ఆలోచనలు కూడా శివుడికి మాత్రమే నిమగ్నం అవుతాయి, ఇది అహంకారం, లోభం, భయం వంటి భావాల నుండి విముక్తి ఇవ్వడం గమనార్హం. నందీశ్వరుడు శివుడి వైపే కూర్చోవడం వలన శివాలయం లో భక్తులు స్వచ్చమైన మనసుతో ప్రార్థన చేయగలుగుతారు. ఈ సాంప్రదాయ బోధన ద్వారా భక్తులకు శివుని వైపే ఏకాంతంగా, ఆత్మీయంగా మనసును కేంద్రీకరించే అవకాశం లభిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Temple Darshan: జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్న మోడీ

