Dailyhunt
TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?

వార్త 3 months ago

తెలంగాణ ఫోన్(TG Politics) ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంటోంది. ఈ కేసులో తాజాగా సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు కీలక నేతలకు త్వరలో SIT నోటీసులు జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ(TG Politics) ప్రత్యర్థులు, ముఖ్య నేతల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విస్తృత దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో భాగంగా SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించగా, అప్పటి ప్రభుత్వంలో కొందరు కీలక నేతల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ వాంగ్మూలం ఆధారంగా SIT దర్యాప్తును మరింత విస్తరించింది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, భద్రతా విభాగాల పాత్రపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయి.

ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వాటి ముగింపు అనంతరం హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని SIT మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరై తమ వాదనలు వినిపించాలని కోరుతూ ఈ నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Krishna Rao: పార్టీ ఉనికి కోసమే ఫామ్ హౌసు బయటకు వచ్చిన కెసిఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha