Dailyhunt
తిరుమల దర్శనం ఇప్పుడు మరింత సులభం

తిరుమల దర్శనం ఇప్పుడు మరింత సులభం

వార్త 4 days ago

TTD updates: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ పెరిగినా, పక్కా ప్రణాళికతో సామాన్య భక్తులు త్వరగా స్వామిని దర్శించుకుంటున్నారు.

కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొక్కులు చెల్లించుకోవడం విశేషం.

Read also: Tirumala: శ్రీవారిపై అపార భక్తి.. వెయ్యిసార్లు మెట్ల దారిలో నడిచిన రిటైర్డ్ టీచర్!

 TTD queue lines management in Tirumala

TTD updates: త్వరితగతిన దర్శనం: సామాన్యులకు పెరిగిన ప్రాధాన్యత

వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణలో టీటీడీ భారీ మార్పులు చేసింది. గతంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు సర్వదర్శనం భక్తులకు 8 గంటల లోపే దర్శనం లభిస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను తాత్కాలికంగా రద్దు చేయడం వల్ల సామాన్య భక్తులకు సమయం బాగా ఆదా అవుతోంది.

రికార్డు స్థాయిలో భక్తులు: ఆదాయంలోనూ కొత్త మైలురాళ్లు

గత మూడు రోజుల్లో 2,45,104 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ. 11.95 కోట్ల ఆదాయం సమకూరింది. మే 2వ తేదీన ఒక్కరోజే లక్ష మందికి పైగా భక్తులు వచ్చినా, టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా రద్దీని నియంత్రించింది. ఆర్జిత సేవలు, దివ్యాంగుల కోటాను కొనసాగిస్తూనే సామాన్యులకు పెద్దపీట వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha