Dailyhunt
Tirumala: లగేజీ తరహాలో పాదరక్షల కౌంటర్లు

Tirumala: లగేజీ తరహాలో పాదరక్షల కౌంటర్లు

వార్త 2 months ago

తిరుమల (Tirumala) లో భక్తులు ఎదుర్కొంటున్న పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం కీలక ముందడుగు వేసింది.

భక్తులు దర్శనానికి వెళ్లే సమయంలో వదిలిపెట్టే పాదరక్షలు తిరిగి దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆధునిక సాంకేతికతతో కూడిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్లను టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి మంగళవారం ప్రారంభించారు. స్థానిక తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ద్వారా 99 శాతం భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందుతున్నారని, గతంలో 70-80 శాతం మంది వదిలి వెళ్లేవారని తెలిపారు. .

Read also:CPI: ట్రంప్‌ను ప్రపంచ బహిష్కరణ చేయాలి

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP: ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha