కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ముఖ్య గమనికను జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read also: TTD Updates: తిరుమలలో భక్తుల రికార్డు: శ్రీవారి సన్నిధిలో పెరిగిన దర్శనాలు
TTD: Services cancelled in Tirumala for 3 days.
ఏయే సేవలు రద్దు అయ్యాయంటే?
నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల రద్దీ కారణంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ కింది సేవలను నిలిపివేశారు:
- ఆర్జిత బ్రహ్మోత్సవం
- సహస్ర దీపాలంకార సేవ
భక్తులకు సూచన
ఈ పరిణయ ఉత్సవాల వేడుకలను కనులారా వీక్షించేందుకు భక్తులకు అనుమతి ఉంటుంది. అయితే, ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న వారు, ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్న వారు ఈ మార్పులను గమనించాలని టీటీడీ కోరింది. 25 నుండి 27 వరకు తిరుమలకు వచ్చే భక్తులు తమ షెడ్యూల్ను దీనికి అనుగుణంగా మార్చుకోవాలని సూచించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

