భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం(TradeAgreement) చైనాకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఒప్పందంలో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన సుంకాల మార్పులు కీలకంగా మారాయి. అమెరికా ప్రస్తుతం భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఆటో భాగాలపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించింది. అంతేకాదు, కొన్ని భారతీయ ఆటో భాగాలపై డ్యూటీ లేకుండా ఎగుమతి చేసుకునే అవకాశం కూడా కల్పించింది.

ఇంపోర్ట్ డ్యూటీ తగ్గింపుతో ప్రీమియం వాహనాలకు దారి
ఇదే ఒప్పందంలో భాగంగా భారత్ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది.
- 800 సిసి నుంచి 1600 సిసి వరకు ఉన్న అమెరికన్ బైకులపై ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసింది.
- 3000 సిసి ఇంజిన్ కలిగిన అమెరికన్ కార్లపై 110% కస్టమ్స్ డ్యూటీని 10 సంవత్సరాల్లో 30%కి తగ్గించే నిర్ణయం తీసుకుంది.
ఈ మార్పులతో భారత మార్కెట్లోకి ప్రీమియం అమెరికన్ బైకులు, కార్లు భారీగా ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే రెండు దేశాల మధ్య ఆటో రంగంలో వ్యాపార సహకారం మరింత బలపడనుంది.
చైనాకు ఎందుకు నష్టం?
ప్రస్తుతం అమెరికా మార్కెట్లో చైనా ఆటో ఉత్పత్తులపై సుమారు 40% వరకు సుంకాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో భారత ఉత్పత్తులపై సుంకం కేవలం 18%కి తగ్గడంతో భారత కంపెనీలకు ధరల పరంగా పెద్ద లాభం కలుగుతుంది. దీంతో అమెరికా మార్కెట్లో చైనా కంపెనీలతో పోలిస్తే భారత కంపెనీలకు పోటీలో ఆధిక్యం లభించనుంది.
భారత ఆటో కంపెనీలకు లాభాలు
ఈ ఒప్పందం వల్ల భారతీయ ఆటోమొబైల్ రంగానికి ఎగుమతులు(TradeAgreement) పెరిగే అవకాశాలు ఉన్నాయి. లాభాల మార్జిన్ పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో భారత కంపెనీల స్థానం బలపడే సూచనలు ఉన్నాయి.
లాభపడే ప్రముఖ భారతీయ కంపెనీలు:
- Bharat Forge: ఇప్పటికే అమెరికాకు పెద్ద మొత్తంలో ఆటో భాగాలు ఎగుమతి చేస్తోంది. సుంకాల తగ్గింపుతో లాభాలు పెరిగే అవకాశం.
- Sona BLW Precision Forgings & Ramkrishna Forgings: అమెరికా మార్కెట్లో విస్తరణకు మంచి అవకాశం.
- Balkrishna Industries (BKT): టైర్ రంగంలో అమెరికాలో కొత్త మార్కెట్ అవకాశాలు.
- Hero MotoCorp: Harley-Davidson భాగస్వామ్యం నేపథ్యంలో ప్రీమియం బైక్ సెగ్మెంట్లో మరింత బలపడే అవకాశం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

