తరచూ ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం, షాక్ ఇచ్చింది.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఒక ఏడాదిలో ఐదు సార్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సును పూర్తిగా రద్దు చేయడం లేదా మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది.

ఈ నెల 1 నుంచే అమల్లోకి
ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వాహనదారుల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో (Traffic Rules)ఈ నిబంధన ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, సిగ్నల్ జంపింగ్ వంటి వాటికీ వర్తించనుంది. కాగా ఈ నెల 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

