Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో సమావేశం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
మొజ్తబాతో భేటీపై ట్రంప్ సంకేతాలు
ఒక అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పరిస్థితులు అనుమతిస్తే మొజ్తబా ఖమేనీని కలవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాలపై కొత్త చర్చకు దారితీశాయి.
తండ్రి తర్వాత బాధ్యతలు చేపట్టిన మొజ్తబా
గతంలో జరిగిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత మొజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. అయితే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా పలు కథనాలు వెలువడ్డాయి. దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా స్పష్టత రాలేదు.
Read also: Italy earthquake: ఇటలీలో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో ప్రకంపనలు
Donald Trump సంబంధాల మెరుగుదలపై ఆశాభావం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకారం, మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం జీవించి ఉన్నారని, మధ్యవర్తుల ద్వారా పరిపాలనా నిర్ణయాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా సమర్థించారు. ఇరుపక్షాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని, చర్చల పురోగతిపైనే భవిష్యత్ భేటీలు ఆధారపడి ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

