Dailyhunt
TTD: తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు

TTD: తిరుమల ఘాట్ రోడ్డులో కొత్త ప్రయాణ నియమాలు

వార్త 2 months ago

TTD: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించే భక్తుల భద్రతతో పాటు అడవుల్లోని వన్యప్రాణుల రక్షణను దృష్టిలో ఉంచుకుని టీటీడీ (Tirumala Tirupati Temples) మరోసారి ప్రయాణ సమయాలు, నియమావళిని స్పష్టంగా తెలియజేసింది.

నిర్దేశిత వేళలను కచ్చితంగా పాటించాలని, వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

టీటీడీ మార్గదర్శకాల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్డుపై ప్రయాణానికి అనుమతి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహనాలకు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి కల్పించనున్నారు. భక్తుల భద్రత కారణంగా అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 3 గంటల వరకు ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు.

Read Also: Srisailam: ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

'టైమ్ లాక్' విధానం అమలు

ఘాట్ రోడ్డులో వాహనాలు అతివేగంగా వెళ్లకుండా నియంత్రించేందుకు టీటీడీ ఇప్పటికే 'టైమ్ లాక్'(time lock system) విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో ఒక వాహనం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి కనీస సమయం నిర్ధారిస్తారు. ఆ సమయానికి ముందే వాహనం గమ్యస్థానానికి చేరుకుంటే, అతివేగంగా ప్రయాణించినట్లు భావించి జరిమానా విధించే అవకాశం ఉంది.

భక్తులకు అధికారుల సూచనలు

టీటీడీ అధికారులు ఘాట్ మార్గంలో ప్రయాణించే భక్తులు

  • వేగ పరిమితిని కచ్చితంగా పాటించాలి
  • అకస్మాత్తుగా బ్రేకులు వేయకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి
  • అడవిలోని వన్యప్రాణులను గౌరవిస్తూ హారన్‌లు, శబ్దాల వినియోగాన్ని తగ్గించాలి
  • నిర్ణీత సమయాల్లోనే ప్రయాణం చేపట్టాలి
    అని సూచించారు.

భక్తులు సహకరిస్తేనే తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు తగ్గి, ప్రకృతి సంరక్షణ సాధ్యమవుతుందని టీటీడీ స్పష్టం చేసింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Tirumala: సూర్యజయంతికి సప్తగిరులు సిద్ధం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha