Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వారికీ కూడా రూ.20వేలు.. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు

వారికీ కూడా రూ.20వేలు.. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు

వార్త 3 weeks ago

Matsyakarula Sevalo Scheme : ఆంధ్రప్రదేశ్‌లోని మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి అండగా నిలిచింది.

వార్షిక సముద్ర వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద కీలక ముందడుగు పడింది. గత నెలలో ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల కుటుంబాలకు రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆధార్ లింకేజ్ లోపాలు, ఈ-కేవైసీ (e-KYC) కాకపోవడం మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల దాదాపు 5,910 మంది అర్హులైన మత్స్యకారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు, వారి వివరాలను త్వరితగతిన పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న ఆ అర్హులందరికీ కూడా రూ. 20,000 చొప్పున మొత్తం రూ. 11.82 కోట్లను విడుదల చేస్తూ తాజాగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నదాత సుఖీభవ లబ్ధిదారులు - సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు

సముద్ర వేట నిషేధ భృతితో పాటు వ్యవసాయ రంగ లబ్ధిదారులకు కూడా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగు చేస్తున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి సంబంధించి కూడా సాంకేతిక కారణాల వల్ల కొందరికి నిధులు అందలేదు. అర్హత ఉండి కూడా ఈ పథకం కింద నిధులు జమకాని రైతులు తమ ఆందోళనను వీడి, వెంటనే తమ పరిధిలోని ‘స్వర్ణ గ్రామం’ లేదా ‘స్వర్ణ వార్డు’ సచివాలయాలను సంప్రదించాలని ప్రభుత్వం కోరింది. అక్కడ అందుబాటులో ఉండే సచివాలయ సిబ్బంది దరఖాస్తుదారుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ వివరాలను సరిచేసి, వారికి నిధులు అందేలా తక్షణ చర్యలు చేపడతారని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ సులభతర విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.

'ఖాకీ' ప్రక్షాళన..ఒకేసారి 23 మంది బదిలీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha