Dailyhunt
వైఎస్ జగన్ పై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు

వైఎస్ జగన్ పై మంత్రి లోకేశ్ తీవ్ర విమర్శలు

వార్త 3 weeks ago

Nara Lokesh Comments: తెలుగుదేశం పార్టీ (TDP) ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రస్తుతం ఒక వింతైన ‘క్రెడిట్ చోరీ వ్యాధి’తో బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read also: Telangana Assembly: ప్రతిపక్షాల తీరుపై భట్టి విక్రమార్క ఆగ్రహం

lokesh-comments-on-jagan-credit-theft-disease

Nara Lokesh Comments: క్రెడిట్ చోరీ వ్యాధి నుంచి కోలుకోవాలి

జగన్మోహన్ రెడ్డి ఇతరుల పనులను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని లోకేశ్ విమర్శించారు. అందుకే ఆయనకు ‘క్రెడిట్ చోరీ వ్యాధి’ సోకిందని, ఆ మానసిక స్థితి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం లేకపోయినా, ప్రతి విషయాన్ని తన ఘనతగా చెప్పుకోవడం జగన్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

అడ్రస్ లేని అరాచక శక్తులు

2019 నుంచి 2024 వరకు సాగిన జగన్ పాలనలో రాష్ట్రం అరాచకాలకు నిలయంగా మారిందని లోకేశ్ గుర్తు చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్న వారే, ఇప్పుడు ప్రజల ఆదరణ కోల్పోయి అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అహంకారానికి తావులేదని, గత ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. రెండు చోట్ల విజయ్‌ పోటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha