Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్ షర్మిలకు దక్కని రాజ్యసభ టికెట్!

వైఎస్ షర్మిలకు దక్కని రాజ్యసభ టికెట్!

వార్త 1 week ago

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది.

కాంగ్రెస్ అధిష్ఠానం తాజాగా ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితాలో షర్మిలకు చోటు దక్కలేదు. కర్ణాటక రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే క్రమంలో.. కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేసింది.

Read Also : Piyush Goyal Tirumala Visit:తిరుమలలో ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ ప్రశంసనీయం : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

 Mallikarjun Kharge

YS Sharmila: కర్ణాటక కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా

కర్ణాటక నుండి ఖాళీగా ఉన్న స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలు .

  • మల్లికార్జున్ ఖర్గే: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు
  • పవన్ ఖేడా: ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి.
  • మన్సూర్ ఆలీ ఖాన్: కేంద్ర మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కుమారుడు.

నేడే మల్లికార్జున్ ఖర్గే నామినేషన్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈరోజు తన రాజ్యసభ నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.

హాజరుకానున్న అగ్రనేతలు

ఈ హై-ప్రొఫైల్ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా పలువురు దక్షిణభారత కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రులు హాజరుకానున్నారు. రాజ్యసభ స్థానం ద్వారా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని భావించిన వైఎస్ షర్మిలకు ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం నుండి టికెట్ దక్కకపోవడంతో ఆమె ప్రధాన అనుచరులు, ఏపీ కాంగ్రెస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే రాబోయే రోజుల్లో ఆమెకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతోందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఘనంగా ముగిసిన నారాయణవనం బ్రహ్మోత్సవాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha