Ramprasad Reddy: రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి ప్రాంతంలో పర్యటించిన ఆయన.. రాజధానిపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందాల్సిన అమరావతిని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. మూడు రాజధానుల ముసుగులో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టేసి, పనులను మధ్యలోనే ఆపేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Amaravati Capital
Read also: Pawan Kalyan: తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?.. రావొద్దనడానికి అంటూ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం
వేలాది రైతు కుటుంబాలను రోడ్డున పడేశారు!
రాజధాని నిర్మాణం కోసం తమ విలువైన భూములను త్యాగం చేసిన అమరావతి రైతుల నమ్మకాన్ని గత వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మంత్రి మండిపల్లి విమర్శించారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండి అమరావతి అభివృద్ధి కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వారు, ఇప్పుడు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఎదుగుదలను అడ్డుకుని, రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన వారే ఈరోజు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
Ramprasad Reddy: కూటమి ప్రభుత్వంలో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి!
గత ప్రభుత్వ హయాంలో జరిగిన రాజధాని విధ్వంసాన్ని సరిదిద్దుతూ, నిలిచిపోయిన నిర్మాణ పనులన్నింటినీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రారంభించిందని మంత్రి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో అమరావతిని ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి నగరంగా, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీకగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. భూములిచ్చిన రైతుల ఆకాంక్షలకు అనుగుణంగానే రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని, ఇప్పటికైనా జగన్ అమరావతిపై శవరాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

