Bear terror in Japan: జపాన్లో సుమారు 5 లక్షల జనాభా కలిగిన నగరంలో ఒక అడవి ఎలుగుబంటి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. దాని స్వైర విహారంతో ఏకంగా వందకు పైగా పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
జపాన్లోని ఉత్సునోమియా నగరంలో ఒక అడవి నల్ల ఎలుగుబంటి జనావాసాల్లోకి ప్రవేశించి, మూడు రోజుల పాటు వీధుల్లో తిరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ఒక పార్కు సమీపంలో 100 కేజీల బరువున్న ఆసియా నల్ల ఎలుగుబంటి మొదట కనిపించింది. ఆ తర్వాత అది నగరంలోని షాపింగ్ ఆర్కేడ్లు, నివాస ప్రాంతాలు, చివరకు అర్ధరాత్రి వేళ సీసీటీవీ కెమెరాల్లో ఒక వీధి గుండా పరిగెడుతూ కనిపించింది. నగర చరిత్రలోనే ఇలా ఎలుగుబంటి రావడం ఇదే మొదటిసారి.
Read also: EPFO: గుడ్ న్యూస్.. త్వరలోనే మీ అకౌంట్లోకి PF వడ్డీ డబ్బులు
Bear wanders into duty area… Government on alert!
Bear terror in Japan: 94 పాఠశాలలు మూసివేత.. ఇళ్లలోనే ప్రజలు
ఎలుగుబంటి సంచారంతో అధికారులు నగర పరిధిలోని అన్ని 94 ప్రభుత్వ ప్రాథమిక, జూనియర్ హైస్కూళ్లను రెండు రోజుల పాటు పూర్తిగా మూసివేశారు. ఎలుగుబంటిని పట్టుకోవడానికి పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, స్థానిక హంటర్స్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. నగర వీధుల్లో లౌడ్స్పీకర్లు ఉన్న వాహనాల ద్వారా.. ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, తలుపులు, కిటికీలు లాక్ చేసుకోవాలని అధికారులు నిరంతరం హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ మార్పుల వల్ల అడవుల్లో ఎలుగుబంట్లు తినే ఓక్ పండ్లు, గింజల కొరత ఏర్పడటం ఒక కారణమైతే, జపాన్ గ్రామీణ ప్రాంతాల్లో జనాభా తగ్గిపోయి పొలాలు బీడుగా మారడంతో.. అడవి జంతువులు సులభంగా నగరాల వైపు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఎలుగుబంట్ల చొరబాట్లను నిరోధించడానికి జపాన్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా అంశాలపై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు!

