Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విధుల్లో ఉండగానే గుండెపోటు.. నిజామాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్ మృతి

విధుల్లో ఉండగానే గుండెపోటు.. నిజామాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్ మృతి

వార్త 5 days ago

Nizamabad News: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మోపాల్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర్, డ్యూటీలో ఉండగానే అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఊహించని ఘటనతో తోటి పోలీస్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఎప్పటిలాగే సోమవారం మోపాల్ ఠాణాలో తన విధుల్లో మునిగిపోయారు. అయితే, డ్యూటీలో ఉండగా ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండె నొప్పి (ఛాతి నొప్పి) వచ్చింది. నొప్పిని తట్టుకోలేక ఆయన క్షణాల వ్యవధిలోనే అందరి ముందే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Read also: Telangana welfare hostels:సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు గుడ్ న్యూస్!

Nizamabad News: ఆసుపత్రికి తరలించేలోపే..

గంగాధర్ కిందపడిపోవడాన్ని గమనించిన తోటి పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రథమ చికిత్స అందిస్తూ, ఆయన్ను అత్యవసరంగా చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. ఆయన ఆసుపత్రికి తీసుకురాక ముందే తుదిశ్వాస విడిచినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం గంగాధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధులకు హాజరైన వ్యక్తి ఇలా హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోపాల్ పోలీస్ స్టేషన్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

జల్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha