తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ తన నామినేషన్ పత్రాల్లో సమర్పించిన వివరాల ప్రకారం, ఆయనకు మొత్తం రూ.624 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో రూ.404.58 కోట్ల చరాస్తులు ఉండగా, రూ.220 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
ముఖ్యంగా ఆయన వద్ద ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రూ.3.01 కోట్ల విలువైన టయోటా లెక్సస్, రూ.2 కోట్ల బీఎండబ్ల్యూ i7 వంటి ఖరీదైన వాహనాలతో పాటు, సామాన్యులు వాడే రూ.67,400 విలువైన ‘టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్’ బైక్ కూడా ఆయన వద్ద ఉండటం విశేషం. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆదాయం రూ.184.53 కోట్లుగా నమోదవ్వగా, ఒక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఖాతాలోనే రూ.213 కోట్ల నగదు నిల్వలు ఉండటం ఆయన ఆర్థిక బలాన్ని చాటుతోంది.
Read Also : Iran War: నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్

రుణాలు లేని రాజకీయ ప్రయాణం – రెండు స్థానాల నుండి పోటీ
విజయ్ సమర్పించిన అఫిడవిట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన పేరు మీద ఒక్క రూపాయి కూడా అప్పు లేదు. ఇది ఆయన ఆర్థిక క్రమశిక్షణను ప్రతిబింబిస్తోంది. ఇక రాజకీయ వ్యూహంలో భాగంగా విజయ్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్నారు. చెన్నైలోని పెరంబూర్ తో పాటు తిరుచ్చి ఈస్ట్ నుండి ఆయన పోటీ చేస్తున్నారు. సోమవారం భారీ అనుచరగణంతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన విజయ్, తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. అలాగే 1992లో చెన్నై లయోలా కళాశాలలో బీఎస్సీ చదువుతూ మధ్యలోనే ఆపేసినట్లు తన విద్యాభ్యాస వివరాలను కూడా పారదర్శకంగా వెల్లడించారు.
లక్ష్యం గద్దె దించడమే – ‘విజిల్’ గుర్తుతో ప్రజల్లోకి
తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విజయ్ తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తన భార్య సంగీత పేరు మీద కూడా రూ.15.76 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నై, కొడైకెనాల్ వంటి ప్రాంతాల్లో విలువైన వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నట్లు డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్లో తమ పార్టీ గుర్తు అయిన ‘విజిల్’ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. సినిమా స్టార్గా ఉన్న క్రేజ్ను ఓట్లుగా మలుచుకుని, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావాలని విజయ్ భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఓట్లు వస్తాయంటే, ప్రధాని మోదీ ఆలయాల గురించి మాట్లాడుతారు: రాహుల్ గాంధీ

