South Coast Railway Zone : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు సాకారమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా మారనున్న 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' (South Coast Railway Zone - SCoR) తన అధికారిక కార్యకలాపాలను ఈరోజు (జూన్ 1) నుండి విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించింది.
దీనితో ఉత్తరాంధ్ర వాసుల 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లయింది. 2014 రాష్ట్ర విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామనే హామీ ఉన్నప్పటికీ, పలు సాంకేతిక కారణాలు, రాజకీయ పరిణామాల వల్ల ఇది కార్యరూపం దాల్చడానికి దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. రైల్వే శాఖ ఈ ప్రతిష్టాత్మక జోన్ పరిధిలోని విధులను తక్షణమే పర్యవేక్షించేందుకు వీలుగా విశాఖపట్నంలోని ‘వీఎంఆర్డీఏ’ (VMRDA) డెక్ భవనంలో తాత్కాలిక జోనల్ ప్రధాన కార్యాలయాన్ని (Temporary Zonal Head Office) సర్వాంగ సుందరంగా సిద్ధం చేసి, నేటి నుండి విధులను అందుబాటులోకి తెచ్చింది.
Read Also : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

ముడసర్లోవలో రూ. 170 కోట్లతో శాశ్వత భవనం.. రీజినల్ డెవలప్మెంట్కు సరికొత్త బూస్ట్!
తాత్కాలిక కార్యాలయంలో విధులను ప్రారంభించినప్పటికీ, భవిష్యత్తు అవసరాల కోసం విశాఖలోని ముడసర్లోవ పరిధిలో దాదాపు 53 ఎకరాల విస్తీర్ణంలో రూ. 170 కోట్ల భారీ వ్యయంతో శాశ్వత జోనల్ కార్యాలయ (Permanent Zonal Office) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కొత్త రైల్వే జోన్ అందుబాటులోకి రావడం వల్ల ఏపీకి స్వతంత్ర రైల్వే నిర్ణయాధికారాలు లభించడంతో పాటు, కొత్త రైళ్లు, అదనపు నిధులు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా మార్గం సుగమం కానుంది. అంతేకాకుండా, ఈ జోన్ ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రవాణా రంగా అభివృద్ధి చెంది, విశాఖ కేంద్రంగా పరిశ్రమలు, వాణిజ్యం మరింత విస్తరించడానికి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఒక మైలురాయిగా నిలవబోతోందని ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

