Viswanath and Sons : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, ప్రతిభావంతుడైన దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'.
రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, రూ. 130 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైంది. రిలీజ్కు ముందే ట్రేడ్ వర్గాల్లో ఊహించని రేంజ్లో హంగామా సృష్టిస్తూ, ఏకంగా రూ. 215 కోట్ల థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ను సాధించింది. సూర్య మార్కెట్ స్టామినాకు, వెంకీ అట్లూరి కథనానికి ఉన్న క్రేజ్ వల్ల ఈ స్థాయి ప్రీ-రిలీజ్ ట్రేడ్ సాధ్యమైందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Suriya Viswanath and Sonsడిజిటల్ నుండి థియేట్రికల్ వరకు: అన్ని హక్కులకు భారీ డిమాండ్
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు అమ్ముడుపోగా, నాన్-థియేట్రికల్ విభాగంలో రికార్డు స్థాయి ఆఫర్లు వచ్చాయి. ఓటీటీ విభాగంలో ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) డిజిటల్ హక్కులను రూ. 85 కోట్లకు దక్కించుకోగా, శాటిలైట్ హక్కులు రూ. 28 కోట్లకు, ఆడియో రైట్స్ రూ. 12 కోట్లకు అమ్ముడయ్యాయి. విడుదలకు ముందే పెట్టిన పెట్టుబడి కంటే అత్యధిక లాభాలను ఆర్జించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

