Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన భార్య

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన భార్య

వార్త 3 weeks ago

Chittoor Crime: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఒక మహిళ, తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం చిత్తూరు జిల్లాలో కలకలం సృష్టించింది.

తమిళనాడు ప్రాంతానికి చెందిన రమేష్, కుప్పం నివాసి అయిన హాసిని అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాది వయసున్న ఒక కుమార్తె కూడా ఉంది.

ఆలయానికి వెళ్లి వస్తుండగా అదృశ్యం

మంగళవారం నాడు రమేష్, హాసిని దంపతులు తమ చిన్నారితో కలిసి బైక్‌పై ప్రసిద్ధ మల్లప్పకొండ మల్లేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. అయితే, రాత్రి దాటినా వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన హాసిని తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.

Chittoor Crime: సీసీటీవీ దృశ్యాలతో బయటపడ్డ నిజం.. అడవిలో శవం!

పోలీసులు పరిశీలించిన సీసీటీవీ దృశ్యాలలో ఒక షాకింగ్ విషయం వెలుగుచూసింది. హాసిని తిరుగు ప్రయాణంలో తన భర్తతో కాకుండా, మరో ఇద్దరు గుర్తుతెలియని యువకులతో కలిసి భర్త బైక్‌పైనే వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి గాలింపు చర్యలు ముమ్మరం చేయగా.. ఘాట్‌రోడ్డు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో రమేష్ రక్తసిక్తమైన మృతదేహం లభించింది.

తన వివాహేతర బంధాన్ని కొనసాగించేందుకే హాసిని, తన ప్రియుడు మరియు మరొకరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితురాలు హాసినితో పాటు ఆమెకు సహకరించిన మిగిలిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జగన్ కు విజన్ లేదు-మంత్రి నారాయణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha