బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం జనవరి 10, 2026న ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలీ, జాఫ్నాల మధ్య మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణంతోపాటు చలి తీవ్రత ఉంటుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ (Weather) అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

