Dailyhunt
West Godavari: రూ.1.53 కోట్లతో భారీ కోడిపందెం?

West Godavari: రూ.1.53 కోట్లతో భారీ కోడిపందెం?

వార్త 2 months ago

సంక్రాంతి పండుగ వేళ పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి.తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన భారీ పందెంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి.

గుడివాడ ప్రభాకర్‌, రాజమండ్రి రమేష్‌ కోళ్ల మధ్య జరిగిన పోటీలో రాజమండ్రి రమేష్‌ గెలిచి రూ.1.53 కోట్లు సొంతం చేసుకున్నాడు. జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద కోడిపందెంగా స్థానికులు చెబుతున్నారు. ముహూర్తాలు, జాతకాలు చూసుకుని పందెం రాయుళ్లు కోళ్లను బరిలో దించడమే ప్రత్యేకతగా మారింది.

Egg Prices: కోడి గుడ్డు ధరలు తగ్గాయ్

వినూత్నంగా నిర్వహిస్తున్నారు

కాగా, గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ పందేల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వీటిని తిలకించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కోడి పందేలను కొన్ని చోట్ల వినూత్నంగా నిర్వహిస్తున్నారు. కోడి పందేల్లో బెట్టింగ్‌లు వేయకుండా.. గెలిచిన వారికి ఖరీదైన బహుమతులు ఇస్తున్నారు. సంక్రాంతి మూడు రోజుల పాటు కోడి పందాలు నిర్వహిస్తుండగా.. చివరి రోజు విజయం సాధించిన వారికి మహీంద్రా థార్ వాహనం పిఠాపురంలో, బహుమతిగా ఇవ్వనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Chandrababu : ఈ నెల 17న కాకినాడకు సీఎం చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha