US - Iran War : ఇరాన్తో జరిగిన నాలుగు నెలల సుదీర్ఘ సైనిక ఘర్షణలో అమెరికా తీవ్రంగా నష్టపోయిందంటూ వస్తున్న అంతర్జాతీయ కథనాలను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ, ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, అసలైన విధ్వంసాన్ని ఇరాన్ అనుభవించిందని స్పష్టం చేశారు. “గడిచిన నాలుగు నెలల యుద్ధం తర్వాత అక్కడ ఏం మారింది? ఇరాన్ సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ పూర్తిగా నాశనమయ్యాయి. వారి మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్లు, డ్రోన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి” అని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఇరాన్ అగ్రనేతలు ఇద్దరు (Top-2 Leaders) హతమయ్యారని, ఆ దేశం సైనికంగా కోలుకోలేని దెబ్బతిన్నదని ఆయన వివరించారు.
Read Also : మిడిల్ ఈస్ట్ శాంతి కోసం అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక టాక్స్.. మధ్యవర్తిగా పాక్!

కుప్పకూలిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ.. లాభాల్లో అమెరికా మార్కెట్లు
ఈ యుద్ధం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అగాధంలోకి నెట్టేసిందని ట్రంప్ గణాంకాలతో సహా వివరించారు. ప్రస్తుతం ఇరాన్లో ద్రవ్యోల్బణం (Inflation) ఏకంగా 250 శాతానికి చేరిందని, అక్కడి మార్కెట్లు పూర్తిగా కుప్పకూలాయని వెల్లడించారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' (Strait of Hormuz) నౌకాయాన మార్గం ఇప్పుడు తిరిగి ఓపెన్ అయిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా (Oil Supply) భారీగా పుంజుకుందని ఆయన గుర్తుచేశారు. ఇరాన్ ఆర్థికంగా నాశనమైనా, అమెరికా మార్కెట్లు మాత్రం ఇప్పటికీ అత్యంత సురక్షితంగా, భారీ లాభాలతో దూసుకుపోతున్నాయని చెప్తూ, ఈ యుద్ధంలో అమెరికాదే పైచేయి అని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

